కడుపునొప్పని కూతురిని ఆస్పత్రికి తీసుకెళ్తే.. గుండెపగిలే నిజం

ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పడంతో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక లొంగిపోయింది. చివరికి..

Update: 2022-05-10 10:42 GMT

others

పదో తరగతి చదువుతున్న కూతురికి కడుపునొప్పని ఆస్పత్రికి తీసుకెళ్తే గుండెబద్దలయ్యే నిజం తెలిసింది. అది కడుపునొప్పి కాదు.. పురిటి నొప్పులని తెలియడంతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అందులోనూ ప్రీ డెలివరీ అని చెప్పి ప్రసవం చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. పట్టుమని పదిహేనేళ్లు నిండకుండానే బిడ్డకు తల్లైంది మైనర్ బాలిక. ప్రేమ పేరుతో ప్రియుడి మోసం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.

తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కొద్దికాలంగా ఆమెను అదే గ్రామానికి చెందిన ఖదీర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. తెలిసీతెలియని వయస్సులోనే హద్దులు దాటేసిన బాలిక గర్భం దాల్చింది. ఆ విషయం తెలియని ఆమె యథావిధిగా ఉంటోంది.

నాలుగు రోజుల కిందట బాలిక కడుపులో నొప్పని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు గుండె ఆగినంత పనైంది. ఆమెకు వచ్చింది కడుపునొప్పి కాదని.. పురిటి నొప్పులని చెప్పడంతో కంగుతిన్నారు. ప్రీ డెలివరీ ప్రసవం చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రియుడి మోసం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, చైల్డ్‌లైన్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News