బ్రేకింగ్ : శ్రీహరికోటలో మరొకరి బలవన్మవరణం

అతని భార్య కూడా బలవన్మరణానికి పాల్పడటంతో.. పిల్లలు దిక్కులేని వారయ్యారు. గత అర్థరాత్రి భర్తను..

Update: 2023-01-18 06:01 GMT

శ్రీహరి కోటలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం రాత్రి CISF కానిస్టేబుల్ చింతామణి (29) చనిపోగా.. సోమవారం CISF ఎస్సై వికాస్ సింగ్ (30) తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనల వెనుక మిస్టరీ వీడకముందే.. శ్రీహరికోటలో మరొకరి ఆత్మహత్య కలకలం రేపింది. వికాస్ సింగ్ భార్య ప్రియాంక సింగ్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

భార్య, ముగ్గురు పిల్లలున్న వికాస్ సింగ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియకుండానే.. అతని భార్య కూడా బలవన్మరణానికి పాల్పడటంతో.. పిల్లలు దిక్కులేని వారయ్యారు. గత అర్థరాత్రి భర్తను చూసేందుకు శ్రీహరికోటకు వచ్చిన ప్రియాంక.. నర్మదా గెస్ట్ హౌస్ లో బలవన్మరణానికి పాల్పడింది. కాగా.. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ సింగ్ కేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో విధుల్లో చేరినట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు, కొడుకు అనారోగ్యమే వారి ఆత్మహత్యలకు కారణాలుగా భావిస్తున్నారు పోలీసులు. వికాస్ సింగ్, అతని భార్య మరణాల పట్ల తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News