సీబీఐ "ఆపరేషన్ గరుడ"

దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది. ఆపరేషన్ గరుడ పేరుతో ఈ తనిఖీలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తుంది.

Update: 2022-09-29 07:35 GMT

దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలను నిర్వహిస్తుంది. ఆపరేషన్ గరుడ పేరుతో ఈ తనిఖీలను దేశంలోని అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తుంది. ఇంటర్ పోల్ సహకారంతో ఈ సీబీఐ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. ఈ దాడుడ్లోల 150 మంది డ్రగ్ ప్లెడర్స్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నేరుగా దేశంలోకి ఉగ్రవాద సంస్థలు డ్రగ్స్ ను డంప్ చేస్తున్నాయి. తీర ప్రాంతాల నుంచి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.

ఇంటర్‌పోల్ సహకారంతో...
వీరి నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ పోల్, సీబీఐ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరోతో కలసి ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ దాడులు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశముంది. ఈ దాడుల్లో రాష్ట్ర పోలీసులు కూడా పాల్గొంటున్నారు. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకునే లక్ష్యంగా ఈ దాడులు చేస్తుంది.


Tags:    

Similar News