BRS : మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ పై కేసు నమోదయింది.

Update: 2024-03-21 04:48 GMT

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ పై కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ఇప్పటికే రహేల్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన సమయంలో రహేల్ కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో రహేల్ డ్రైవర్ ప్రమాదం జరిగినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఈ ప్రమాదానికి రహేల్ కారణమని తాజాగా కేసు నమోదు చేశారు.

కారు డ్రైవింగ్ చేస్తుంది...
2022 మార్చి 17న జూబ్లీహిల్స్ లో కారు ప్రమాదం జరిగి ఒక బాలుడు మరణించిన ఘటనలో ఈ కేసు నమోదయింది. యాచకవృత్తి చేసుకుంటున్న వారిని ఈ కారు అదుపు తప్పి ఢీకొట్టడంతో ఆఘటనలో బాలుడు మరణించాడు. రహేల్ దుబాయ్ పారిపోవడంతో అందుకు సహకరించిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సీీసీ టీవీ కెమెరాలతో పాటు వేలిముద్రల ఆధారంగా రహేల్ కారు నడిపినట్లు గుర్తించారు.


Tags:    

Similar News