దారుణం.. కనిపెంచిన తండ్రిని కడతేర్చిన కూతురు

ఓ కూతురు తండ్రిపై దాడి చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

Update: 2023-07-30 12:03 GMT

ఓ కూతురు తండ్రిపై దాడి చేసి అతి దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కనిపెంచిన తల్లిదండ్రులు మందలించిన, కోప్పడిన యువత అది భరించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కోపడ్డారని, మందలించారని, ఫోన్ పోయిందని, పరీక్షలు ఫెయిల్ అయ్యామని ఇలా రకరకాల కారణాలతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో మరెన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ అంబర్పేట్‌లో నివాసం ఉంటున్న యువతి మాత్రం మందలించిన తండ్రిని అతి దారుణంగా హత్య చేయడంతో స్థానికుల సైతం భయభ్రాంతులకు గురయ్యారు.

అంబర్పేట్‌లో నివాసం ఉంటున్న జగదీశ్వర్ అనే వ్యక్తికి నిఖిత అనే కూతురు ఉంది. జగదీశ్వర్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు నిఖిత అఫ్జల్గంజ్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తుంది. ఈ క్రమంలోనే నిఖిత ప్రతిరోజు ఆలస్యంగా ఇంటికి వచ్చేది. అది గమనించిన తండ్రి ఇలా రాత్రిపూట ఆడపిల్ల ఒంటరిగా రావడం ప్రమాదకరమని.. అందుకే త్వరగా ఇంటికి రావాలని మందలించాడు. దీంతో ఆగ్రహానికి లోనైనా నిఖిత అక్కడ ఉన్న గాజు పెంకును తీసుకొని ఒక్కసారిగా తండ్రి మీదికి దాడి చేసి తండ్రి గొంతు కోసింది.

తండ్రి జగదీశ్వర్ గట్టి గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు బయటికి వచ్చి చూడగా గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అవుతుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే తండ్రి జగదీశ్వర్ ను స్థానిక హాస్పిటల్ కి తరలించారు. హాస్పటల్లో చికిత్స పొందుతూ తండ్రి జగదీశ్వర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిఖితను అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. జగదీశ్వర్ మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Tags:    

Similar News