లారీ టైరుకు పంక్చర్.. ఇంతలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పత్తిపాడు హైవేపై ఘోర ప్రమాదం

Update: 2024-02-26 03:01 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పత్తిపాడు హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు వ్యక్తుల పైనుంచి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాడినాడ-చిన్నంపేట హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

ఒక లారీ టైరుకు పంక్చర్ కావడంతో దానిని రోడ్డు పక్కన ఆపారు. టైర్ మార్చడంలో వీరికి సహాయంగా మరో లారీ డ్రైవర్, క్లీనర్ కూడా వచ్చారు. వీరంతా టైర్ మార్చడంలో ఉండగా.. సూపర్ లగ్జరీ బస్సు వీరి పైనుంచి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో రాజమండ్రి సమీపంలోని మొమ్మూరు వద్ద పోలీసులు బస్సును గుర్తించి ఆపారు. నిందిత డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతులను దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందినవారని, ఒకరు ప్రత్తిపాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News