ఒడిశాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కును ఆటో ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

Update: 2022-08-28 03:33 GMT

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కును ఆటో ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఒడిశాలోని డెంకానాల్ జిల్లాో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మైనర్ కూడా మరణించారని పోలీసులు తెలిపారు.

మృతులంతా...
మరణించిన వారంతా డెంకనాల్ జిల్లాలోని బంగూర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఆటోలో ముక్తపేసి ప్రాంతానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News