తిరుపతిలో దారుణం.. మత్తుమందిచ్చి బాలికపై గ్యాంగ్ రేప్

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై కన్నేసిన కామాంధులు అత్యంత నీచానికి ఒడిగట్టారు

Update: 2022-09-01 14:45 GMT

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలికపై కన్నేసిన కామాంధులు అత్యంత నీచానికి ఒడిగట్టారు. మత్తుమందిచ్చి బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దుండగుల లైంగిక దాడిలో గాయాలపాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ అమానుష ఘటన సత్యవేడు నియోజకవర్గ పరిధి కేవీబీ పురం మండలంలో జరిగింది. నిన్న వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న బాలికను కొందరు యువకులు ఎత్తుకెళ్లారు. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. బాలికపై అఘాయిత్యం గురించి తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News