బెంగళూరులో 7 కోట్లు దోచుకెళ్లారు

బెంగళూరు నగరంలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు.

Update: 2025-11-20 14:06 GMT

బెంగళూరు నగరంలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినిమా స్టైల్లో దొంగలు దోచుకున్నారు. క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ వ్యాన్‌ నుంచి 7 కోట్ల 11 లక్షల రూపాయల భారీ దొంగతనం జరిగింది. జేపీ నగర్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్ కరెన్సీ చెస్ట్ నుంచి నగదు తీసుకుని ఏటీఎంలలో నింపేందుకు వాహనం బయలుదేరింది. బండిలో కస్టోడియన్ అఫ్తాబ్, డ్రైవర్ బినోద్ కుమార్, గన్‌మెన్ రాజన్న, తమ్మయ్య ఉన్నారు. వ్యాన్‌ అశోకా పిల్లర్‌ వద్దకు రాగానే ఓ వైట్‌కలర్‌ టయోటా ఇన్నోవా అడ్డగించింది. తాము ఆర్‌బీఐ అధికారులమని అందులో నుండి దిగిన అధికారులు తెలిపారు. ఆర్‌బీఐ విచారణ జరుపుతోందని తమ వెంట రావాలన్నారు. డెయిరీ సర్కిల్‌ వద్ద వ్యాన్‌ డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి కోట్ల రూపాయల నగదు తీసుకుని పరారయ్యారు.

Tags:    

Similar News