Ys Sharmila : పులివెందులలో వైఎస్ షర్మిల ప్రచారం.. ఇలా చేస్తుంటే?

ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుందని ఎస్ షర్మిల అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఆమె ప్రచారాన్ని నిర్వహించారు

Update: 2024-05-09 08:08 GMT

ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుందని ఎస్ షర్మిల అన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఆమె ప్రచారాన్ని నిర్వహించారు. కడప లో న్యాయం గెలిస్తుందా ? నేరం గెలుస్తోందా ? అని జనం ఎదురుచూస్తున్నారన్నారు. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్నానని వైఎస్ షర్మిల కోరారు. ఒక వైపు వైఎస్సార్ బిడ్డ..ఆ వైపు వివేకా హత్య నిందితుడు అవినాష్ రెడ్డి అంటూ మరోసారి వ్యాఖ్యానించారు. పదేళ్లు ఎంపీగా ఉనన అవినాష్ రెడ్డి కడప స్టీల్ గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వైఎస్సార్ కల అని ఆమె తెలిపారు.

అవినాష్ రెడ్డి ఎప్పుడైనా...
ఎంపీ గా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ కోసం ఒక్క ఉద్యమం చేయలేదన్న వైఎస్ షర్మిల వైజాగ్ స్టీల్ ఎట్లా నో..రాయలసీమ కి కడప స్టీల్ అంతా ప్రాధాన్యత ఉందన్నారు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారన్నారు. డిల్లీకి సీబీఐ కోసం పోతున్నాడని, కడప ప్రజల కోసం ఒక్క నాడు పోలేదని అన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని తాము చెప్పలేదని, సీబీఐ ఆరోపణల ప్రకారమే తాము మాట్లాడుతున్నామని తెలిపారు. వైఎస్ షర్మిల వెంట ప్రచారంలో వైెఎస్ సునీత కూడా పాల్గొన్నారు.


Tags:    

Similar News