Ys Jagan : కోడుమూరులో జగన్ రోడ్ షో

వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర కోడుమూరులో జరుగుతుంది. ఆయన రోడ్ షోను నిర్వహించారు.

Update: 2024-03-29 07:31 GMT

వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్ర కోడుమూరులో జరుగుతుంది. ఆయన రోడ్ షోను నిర్వహించారు. బస్సు పైన నిల్చుని జగన్ ప్రజలకు అభివందనం చేస్తూ రోడ్ షోను నిర్వహిస్తున్నారు. కోడమూరు వైసీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఇడుపులపాయ నుంచి ఈ నెల 27వ తేదీన బస్సు యాత్రను ప్రారంభించిన జగన్ తొలి రోజు ప్రొద్దుటూరు, రెండో రోజు నంద్యాలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

మూడో రోజు ...
నేడు మూడోరోజు బస్సు యాత్ర కొనసాగుతుంది. పెంచికలపాడు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర కోడుమూరు నియోజకవర్గానికి చేరుకుంది. దారిపొడవునా పార్టీ కార్యకర్తలు జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. జగన్ ను దగ్గర నుంచి చూసేందుకు అనేక మంది తరలి రావడంతో వారిని కట్టడిచేయడం పోలీసులకు అసాధ్యమయింది. కొన్ని చోట్ల జగన్ బస్సు దిగి ప్రజలను, నేతలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరికాసేపట్లో జగన్ ఎమ్మిగనూరులో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.


Tags:    

Similar News