నేడు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో?

నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై విచారణ జరగనుంది

Update: 2022-01-28 02:27 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు రాజధానుల అంశంపై విచారణ జరగనుంది. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై దాదాపు 77 పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. అయితే దీనిపై త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.

రద్దు చేశామని....
ప్రభుత్వం ఇప్పటికే మూడు రాజధానుల బిల్లులను, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కు తీసుకుంది. వాటిని రద్దు చేసింది. ఈ విషయమే హైకోర్టుకు తెలిపింది. కానీ మరో రూపంలో బిల్లులు తెస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనను పిటీషన్ దారులు ఉదహరిస్తున్నారు. మరి ఈరోజు హైకోర్టులో జరిగే విచారణలో ఏం తేలనుందో చూడాలి. కరోనా దృష్ట్యా విచారణను వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నారు


Tags:    

Similar News