నేడు పాదయాత్ర మళ్లీ ప్రారంభం

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేడు 22వ రోజుకు చేరుకుంది.

Update: 2021-11-22 02:02 GMT

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేడు 22వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా నుంచి నేడు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో చేపట్టిన పాదయాత్ర తిరుమలలో ముగియనుంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో యాత్రలో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

అన్ని పార్టీలూ....
రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్రకు అన్నిపార్టీలు సంఘీభావం ప్రకటించాయి. నిన్నటి నుంచి బీజేపీ నేతలు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నారు. సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నేతలు పాల్గొని రాజధాని అమరావతిలోనే ఉంచాలని నినాదాలు చేశారు. వర్షాల కారణంగా రెండు రోజులు విరామం ఇచ్చిన రైతులు నేడు మహా పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News