శ్రీవారి ఎదుట కేశినేని కోరిక ఏంటంటే?

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని దర్శించుకున్నారు.

Update: 2023-03-05 12:48 GMT

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాను తిరుమల శ్రీవారిని కోరుకున్నానని కేశినేని నాని తెలిపారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే....
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు ఏపీకి రావాలని కేశినేని నాని ఆకాంక్షించారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నదే అందరి కోరిక అని నాని అన్నారు. ప్రభుత్వం సంబంధం లేకుండా ఉపాధి అవకాశాలు దక్కితేనే యువత పెడదారి పట్టకుండా ఉంటుందని కేశినేని నాని ఆకాంక్షించారు.


Tags:    

Similar News