మండే కూడా ఇంత క్యూ లైనా?

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

Update: 2023-01-30 02:37 GMT

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లో ఉన్న భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. ఎస్ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,639 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,131 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.16 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News