రథసప్తమి... రద్దీ కూడా ఎక్కువే

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రథసప్తమి కావడంతో స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు.

Update: 2023-01-28 03:38 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రథసప్తమి కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఈరోజు రథసప్తమి కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుందని ముందు నుంచే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 59,695 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,286 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News