కిటకిటలాడుతున్న కొండ

సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీపావళి పండగ కూడా కలసి రావడంతో భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

Update: 2022-10-23 03:19 GMT

వరస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీపావళి పండగ కూడా కలసి రావడంతో భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిట లాడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరు స్వామి వారి దర్శనం చేసుకునేందుకు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు తెలిపారు.

కొత్తగా వచ్చే వారికి...
రూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుందని తెలిపారు. క్యూలైన్ లోకి కొత్తగా వచ్చే వారికి మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,299 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,625 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News