కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

Update: 2022-01-28 14:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి ప్రజల భవిష్యత్ అంధకారంలోకి నెట్టిందని చంద్రబాబు ఆవేదన చెందారు. ఆయన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు.

ఆర్థిక అక్రమాలను....
రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఉల్లంఘనలపై ప్రస్తావించాలని పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలను ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవాలని పార్లమెంటు సభ్యులను కోరారు. వైసీీపీకి 28 ఎంపీలు ఉండి ఈ రెండున్నరేళ్లలో ఏం సాధించారని? రాష్ట్రానికి ఏం తెచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలుంటే హడావిడిగా కొత్త జిల్లాల ప్రతిపాదనను తెచ్చారని చంద్రబాబు మండి పడ్డారు.


Tags:    

Similar News