9.2 కిలోల బంగారంతో సత్యసాయి
శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కిలోల బంగారంతో సిద్ధం చేసిన సత్యసాయి ఉత్సవ విగ్రహాన్ని 31.8 అడుగుల ఎత్తయిన వెండి రథంలో ప్రతిష్ఠించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. రథం తయారీలో 180 కిలోల వెండిని, పూతగా కిలో బంగారాన్ని వినియోగించారు. ప్రపంచ శాంతి కోసం సత్యసాయి బాబా మహాసమాధి వద్ద 1,100 జంటలు కలిసి సత్యనారాయణ వ్రతం చేశారు.