కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మూడు రోజులు సెలవులు పూర్తయినా భక్తులు ఇంకా తిరుమలపై దర్శనం కోసం వేచి ఉన్నారు

Update: 2023-04-10 01:59 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మూడు రోజులు సెలవులు పూర్తయినా భక్తులు ఇంకా తిరుమలపై దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదకొండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్‌లోకి ప్రవేశించని భక్తులకు స్వామి వారి దర్శన సమయం 24 గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాలయ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 86,129 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో స్వామి వారికి 28,094 మంది భక్తులు తమ తలనీలలాను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.86 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News