ఈరోజు తిరుమల వెళ్లారంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు

Update: 2022-11-03 03:28 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిటికిటలాడిపోతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. ఇది ఇప్పుడు క్యూలైన్ లో ఉన్న భక్తులకు మాత్రమే. కొత్తగా క్యూలైన్ లోకి వచ్చే భక్తులకు అదనంగా మరో రెండు, మూడు గంటలు పడుతుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,995 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 29,037 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News