ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు

Update: 2022-09-25 02:39 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి స్వామి దర్శనం కోసం 12 గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో భక్తులకు దర్శనం కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రకూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు.

హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 77,855 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,925 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.44 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది.


Tags:    

Similar News