తిరుమలలో రష్.. సోమవారం...?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Update: 2022-12-05 03:01 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం 24 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లో ప్రవేశించే వారికి అదనంగా మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టోకెన్ పొందిన భక్తులకు నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుందన్నారు.

ప్రత్యేక దర్శనం....
అలాగే మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,001 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 32,967 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News