పెరిగిన హుండీ ఆదాయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి పథ్నాలుగు గంటల సమయం పడుతుంది.

Update: 2022-09-13 03:44 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి పథ్నాలుగు గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

కొనసాగుతున్న భక్తుల రద్దీ....
నిన్న తిరుమల శ్రీవారిని 74,231 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,591 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.14 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత హుండీ ఆదాయం ఐదు కోట్లు దాటింది.


Tags:    

Similar News