రష్ అదిరిపోయింది... హుండీ ఆదాయం కూడా
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో తిరుమలలో భక్తుల సంఖ్య మరింత పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో తిరుమలలో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 38 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పుడు క్యూ లైన్ లో వచ్చే వారికి నలభై నుంచి నలభై ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం ....
కార్తీకమాసంలో భక్తులను సందర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 82,604 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 37,025 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.57 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.