సండే... తిరుమల రద్దీ ఎంత ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో అత్యధిక శాతం మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో అత్యధిక శాతం మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక దర్శనం....
రూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,675 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,533 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.