తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. నిన్నటి వరకూ భక్తులతో కిటకిటలాడిన తిరుమల నేడు కొంత తగ్గింది

Update: 2022-11-17 03:59 GMT

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. నిన్నటి వరకూ భక్తులతో కిటకిటలాడిన తిరుమల నేడు కొంత తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి స్వామి వారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు క్యూ లైన్ లో వచ్చే వారికి మాత్రం అదనంగా మరో నాలుగైదు గంటల సమయం పడుతుంది.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 74,412 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 27,626 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.27 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News