శనివారం... రద్దీ సాధారణం

తిరుమలలో రద్దీ తగ్గింది. శనివారం రద్దీ తగ్గడంతభక్తులు సులువుగా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు.

Update: 2023-03-25 02:32 GMT

తిరుమలలో రద్దీ తగ్గింది. శనివారం రద్దీ తగ్గడంతభక్తులు సులువుగా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. దర్శనానినికి తక్కువ సమయం పడుతుండంటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు నాలుగు గంటల్లో శ్రీవారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

పది గంటల్లో...
సర్వదర్శనం టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,507 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,025 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News