రెండు రోజులు రాష్ట్రపతి విశాఖలోనే

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ నెల 20వ తేదీన విశాఖపట్నానికి రానున్నారు.

Update: 2022-02-10 02:32 GMT

భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ నెల 20వ తేదీన విశాఖపట్నానికి రానున్నారు. ఆయన నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలో పాల్గొంటారు. ఈ నెల 20 వ తేదీ భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు చేరుకుంటున్నారు. 20వ తేదీ రాత్రి నౌకాదళ అతిధి గృహంలో బస చేయనున్నారు.

ప్రెసిడెంట్ ప్లీట్ లో....
ఈ నెల 21వ తేదీన ప్రెసిడెంట్ ప్లీట్ జరగనుంది. అందులో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ పాల్గొంటారు. ఆరోజు మొత్తం అక్కడే ఉంటారు. ఈ నెల 22 వ తేదీ ఉదయం పదిగంటలకు ప్రత్యేక విమనాంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News