పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన మూడో విడత వారాహి విజయ యాత్రకు

Update: 2023-08-11 10:47 GMT

విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన మూడో విడత వారాహి విజయ యాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణ్ శుక్రవారం రుషికొండ, ఎర్రమట్టిదిబ్బలను క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ బయలుదేరగా అందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. విశాఖలోని రుషికొండలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలోని జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతింబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ నుంచి కేవలం పవన్‌ వాహనానికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్‌ వెళ్లాలని.. గీతం యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పోలీసులు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నంలో మూడో విడత వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర ఆగష్టు 19 వరకు కొనసాగనుంది.

పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖ చేరుకున్నప్పటి నుంచి పోలీస్ ఆంక్షలు అమలవుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్పీచ్ కు సంబంధించి కూడా విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గురువారం జరిగిన సభలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో ఆరోపించారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. వారాహి విజయయాత్రలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని విశాఖపట్నం తూర్పు ఏసీపీ నోటీసులు అందజేశారు.


Tags:    

Similar News