తిరుమలలో భక్తుల క్యూ లైన్ ను చూస్తే?

క్యూ లైన్ లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే పన్నెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Update: 2022-09-23 02:15 GMT

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరు దర్శనం చేసుకోవాలంటే పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రూ.300 లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 65,187 భక్తులు దర్శించుకున్నారు. 27,877 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు సమర్పించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.37 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ నెల 26వ తేదీన శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News