తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
ఈరోజు శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఏడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. ఒక్కసారిగా భక్తులు రద్దీ పెరగడంతో దర్శన సమయం ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 9 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఏడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి దర్శనం పది గంటల సమయం పడుతుందని అంటున్నారు.
ప్రత్యేక దర్శనానికి...
మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,689 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,640 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.42 కోట్ల రూపాయల వరకూ ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.