Andhra Pradesh : నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిచిపోనున్నాయి
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. ఆసుపత్రులకు రావాల్సిన బకాయీలను చెల్లించకపోవడంతో వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఓపీ నుంచి ఆపరేషన్ల వరకూ ఎన్టీఆర్ వైద్య సేవలను ఈ రోజు నుంచి నిలిపివేస్తున్నట్లు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం రూ.650 కోట్ల బకాయిలు విడుదల చేసేవరకు చర్చలకు వెళ్లకూడదని ఆస్పత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.
ఓపీలతో పాటు...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు నేటి నుంచి బంద్ కానున్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బకాయిలు చెల్లించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆస్పత్రుల అసోసియేషన్ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులకు 2,700 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, అందుకే ఈ సేవలను నిలిపివేస్తున్నామని వారు ప్రకటించింది.