Nellore : వేడెక్కిన సింహపురి రాజకీయం.. టీడీపీ వర్సెస్ వైసీపీ
నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ, టీడీపీ నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలాగైనా నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీన నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతిపై అవిశ్వాసం కోసం కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 53 మంది కార్పొరేటర్లున్నారు. అందులో అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత నలభై మంది సభ్యులు టీడీపీలో చేరారు. మేయర్ ను పక్కన పెడితే టీడీపీకి ముప్ఫయి ఆరు మంది సభ్యుల బలం ఉంది. మరొకవైపు వైసీపీ కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. నిన్న వైఎస్ జగన్ సమక్షంలో ఐదుగురు చేరడంతో వీరి సంఖ్య పదహారుకు చేరుకుంది.