YSRCP : షర్మిలకు బొత్స సుద్దులు.. అలా మాట్లాడకూడదు తల్లీ... అంటూనే?

పీసీసీ చీఫ్ షర్మిల మాటలు వింటుంటే జాలి వేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు

Update: 2024-01-25 07:51 GMT

పీసీసీ చీఫ్ షర్మిల మాటలు వింటుంటే జాలి వేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేత చంద్రబాబు మాట్లాడిన మాటలే ఆమె మాట్లాడుతుందని బొత్స అన్నారు. ప్రత్యేక హోదాను కాదన్నది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీని కావాలన్నది చంద్రబాబే కదా? అని అన్నారు. అలాంటి చంద్రబాబును వదలిపెట్టి తమ పార్టీని షర్మిల టార్గెట్ చేయడమేంటని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని, ప్రజలు గమనిస్తున్నారన్నారు.

అంశాల వారీగానే...
తాము కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇస్తున్నామన్న బొత్స సత్యనారాయణ తాము మూడు రాజధానులంటే.. బీజేపీ రాజధాని అమరావతి అనింది కదా? అని ఆయన అన్నారు. తాము కేంద్రంలో కేవలం అంశాల వారీగానే మద్దతిస్తున్నామన్నారు. గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అంటే ఇప్పుడు కాదంటున్నారంటే ఆయన రాజీనామా కేవలం డ్రామా కోసమే చేశారా? అని అడిగారు. రాజీనామా ఇచ్చిన తర్వాత కూడా స్పీకర్ ఇంటికి వెళ్లి కలసి తన రాజీనామాను ఆమోదించాలని గంటా కోరిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.


Tags:    

Similar News