జగన్ ను చూసి భయపడాల్సిన పనిలేదు

ముఖ్యమంత్రి జగన్ ను, వైసీపీని చూసి భయపడాల్సిన పని లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

Update: 2022-02-14 03:51 GMT

ముఖ్యమంత్రి జగన్ ను, వైసీపీని చూసి భయపడాల్సిన పని లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజలను భయపెట్టే పాలన మనకు అవసరం లేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. సామాన్యులను ఇబ్బంది పెట్టే మాదిరి జగన్ రెడ్డి పాలన సాగుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది కన్పించకుండా పోయిందని చెప్పారు.

ఓటీఎస్ కు వ్యతిరేకం.....
ఓటీఎస్ పేరుతో ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఈ ప్రభుత్వం తాళాలు వేస్తుందని, ఓటీఎస్ విధానాన్ని జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ప్రభుత్వం చివరకు ఉద్యోగులను కూడా మోసం చేసిందని తెలిపారు. సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తుంగలో తొక్కారన్నారు. ఈ ప్రభుత్వం మత్స్య కారుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ఈ నెల 20వ తేదీన నరసాపురంలో జరిగే మత్స్యకారుల బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని చెప్పారు.


Tags:    

Similar News