Andhra Pradesh : గుడ్ న్యూస్... నామినేటెడ్ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. డీసీఎంఎస్ ఛైర్మన్లను జిల్లాలకు ఎంపిక చేసింది

Update: 2025-04-28 13:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. డీసీఎంఎస్ ఛైర్మన్లను జిల్లాలకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పది జిల్లాలకు సహకార బ్యాంకుల ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా నెట్టెం రఘురాంను నియమించింది. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్ గా శివ్వల సూర్యనారాయణ, విశాఖ డీసీసీబీ ఛైర్మన్ గా జనసేనకు చెందిన కోన తాతారావును నియమించింది. విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ గా కిమిడి నాగార్జులన, గుంటూరు డీసీసీబీ ఛైర్మన్ గా మాకినేని మల్లికార్జున రావు, నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్ గా ధనుంజయ్ రెడ్డి, చిత్తూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి, అనంతపురం డీసీసీబీ ఛైర్మన్ గా కేశవరెడ్డి, కర్నూలు డీసీసీబీ ఛైర్మన్ గా డి.విష్ణువర్ధన్ రెడ్డి, కడప డీసీసీబీ ఛైర్మన్ గా బి. సూర్యనారాయణరెడ్డిని నియమించారు.

డీసీఎంస్ ఛైర్మన్ లుగా
ఇక డీసీఎంస్ ఛైర్మన్ లుగా కూడా చంద్రబాబు కొన్ని జిల్లాలకు నియామకాలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాకు అవినాష్ చౌదరి, విశాఖ జిల్లాకు కొట్ని బాలాజీ, విజయనగరం జిల్లాకు గొంప కృష్ణ, గుంటూరు డీసీఎంస్ ఛైర్మన్ గా వడ్రాణం హరిబాబు, కృష్ణా జిల్లా డీసీఎంస్ ఛైర్మన్ గా జనసేన కు చెందిన బండి రామకృష్ణను నియమించారు. నెల్లూరు జిల్లాకు గొనుగోడు నాగేశ్వరరావు, చిత్తూరు జిల్లాకు సుబ్రహ్మణ్యం నాయుడు, అనంతపురం జిల్లాకు నెట్టెం వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లాకు నాగేశ్వర్ యాదవ్, కడప జిల్లా డీసీఎంస్ ఛైర్మన్ గా జయప్రకాశ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన డీసీసీబీ, డీసీఎంస్ ఒకటి కేటాయించగా, బీజేపీకి ఒక్క స్థానం కూడా కేటాయించలేదు.


Tags:    

Similar News