కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై చంద్రబాబు ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు

Update: 2026-02-01 12:34 GMT

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా అరకు రీజియన్ అభివృద్ధి అంశాన్ని కేంద్ర బడ్జెట్ లో పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పులికాట్ సరస్సు అభివృద్ధికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఫ్లెమింగోలు అరుదైన పక్షులు కూడా ఆ ప్రాంతానికి ఆలవాలంగా ఉంటాయన్నారు. ఈస్ట్ కోస్ట్ కారిడార్ వల్ల లాజిస్టిక్స్ పరంగా గణనీయమైన వృద్ధి నమోదు అవుతుందని తెలిపారు. అంతర్గత జలరవాణాకు కూడా ఊతమిచ్చేలా బడ్జెట్లో నిధులు పెట్టారు. వెయ్యి కిలోమీటర్ల పొడవైన ఏపీ తీర ప్రాంతం అంతా గణనీయమైన వృద్ధి చెందుతుందన్నారు. లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఇప్పటికే ఏర్పాటు చేశామన్న చంద్రబాబు పట్టణాల అభివృద్ధి, గ్రోత్ సెంటర్లకు నిధులు కేటాయించారన్నారు. విశాఖ ఆర్ధిక రీజియన్ , తిరుపతి గ్రోత్ రీజియన్, అమరావతి రీజియన్లు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందన్న చంద్రబాబు కంటైనర్స్ ద్వారా లాజిస్టిక్స్ మరింత వేగవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు.

నిరుద్యోగ అవకాశాలు...

రీజినల్ మెడికల్ హబ్స్ , ఆయుష్ హబ్స్ ఏర్పాటుకు కూడా బడ్జెట్లో నిధులు ఇచ్చారు. వీటన్నిటినీ ఇంటిగ్రేట్ చేసుకుని ఏపీ వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సంజీవని ప్రాజెక్టు ఈ ఏడాదిలో ఓ గేమ్ చేంజర్ గా మారుతుందని, బయోసైన్స్ కు ఇది నాంది పలుకుతుంది. వ్యక్తిగతంగా ఔషధాలను నిర్దేశించే స్థాయికి వెళ్లొచ్చని, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం ద్వారా ప్రతీ ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. 75 శాతం ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ ఇచ్చేలా కేంద్రం నిర్ణయించింది... రాష్ట్రం తరపున 20 శాతం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ కు వెళ్లేలా మరిన్ని సంస్కరణలు రావాలని, ఇప్పటికే జీఎస్టీ సంస్కరణలు, కార్మిక సంస్కరణలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెస్సు ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ సాధ్యం అవుతుందన్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పాలసీలకు వెసులుబాటు కల్పించేలా బడ్జెట్ ఉందని చెప్పారు.










Tags:    

Similar News