తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు

Update: 2023-02-01 02:07 GMT

TTD

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్‌లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం చేసుకోవాలనుకుంటున్న భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల దర్శన సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,939 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 20,203 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.17 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News