తిరుమలలో రష్ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశముంది.

Update: 2023-02-03 02:25 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశముంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ ను కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటలు దర్శనం దొరుకుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 60,609 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,394 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News