రష్...తగ్గడం లేదు.. తిరుమలలో క్యూ లైన్?

తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. శనివారం కావడంతో భక్తులు సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉంది

Update: 2022-10-14 04:18 GMT

తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. శనివారం కావడంతో భక్తులు సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. ఏటీజీ గెస్ట్ హౌస్ వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి సమయం 30 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమలలో శ్రీవారిని 72,216 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,338 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.65 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News