శనివారం.. భక్తుల రద్దీ...?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శనివారమైనా భక్తుల రద్దీ అనుకున్న స్థాయిలో లేదు.

Update: 2023-02-04 02:30 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శనివారమైనా భక్తుల రద్దీ అనుకున్న స్థాయిలో లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 57,147 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,094 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News