సాధారణంగానే తిరుమలలో రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు.

Update: 2023-02-08 02:18 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. బుధవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వ దర్శనం టోకెన్లు లేని భక్తులు ఇప్పుడు క్యూ లైన్ లో ప్రవేశిస్తే దర్శనానికి మరింత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

రెండు గంటల్లో...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,297 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,975 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News