తిరుమలలో భక్తుల రద్దీ ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. నవంబరు నెలలో కొంత భక్తుల రాక తగ్గిందని అధికారులు చెబుతున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది. నవంబరు నెలలో కొంత భక్తుల రాక తగ్గిందని అధికారులు చెబుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. వీరు స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ఐదు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఇప్పుడు క్యూ లైన్ లో వెళ్లే వారికి అదనంగా మరో రెండు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి గంట నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,946 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,990 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.73 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.