తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శనివారం కూడా భక్తుల రద్దీ తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి.

Update: 2022-12-03 02:39 GMT

tirumala special entry darshan tickets for december

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శనివారం కూడా భక్తుల రద్దీ తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లలన్నీ నిండకుండానే నేరుగా భక్తులు క్యూ లైన్ లలో స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్ లో వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం మూడు గంటల సమయం పడుతుందని వారు వెల్లడించారు.

మూడు గంటల్లోనే....
ఇక మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి గంట నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,568 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,501 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News