YCP:వైసీపీలోకి చేరిన భూమా కిషోర్ రెడ్డి

వైసీపీ లోకి పలువురు ప్రముఖులు చేరుతున్నారు. ఏపీసీసీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు

Update: 2024-03-05 03:26 GMT

YCP:వైసీపీ లోకి పలువురు ప్రముఖులు చేరుతున్నారు. ఏపీసీసీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు జెట్టి గుర్నునాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీలో చేరారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సి ప్రాంతీయ సమన్వయకర్త పి.వి. మిథున్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో ఈ చేరికలు సాగాయి. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జి భూమా కిషోర్‌రెడ్డి, ఇతర నేతలు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కరరెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డితో పాటు పలువురు ముఖ్యమంత్రి వైఎస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి (నాని), వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌ఛార్జి గా భూమా కిషోర్‌ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్డీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే తమ లక్ష్యమని భూమా కిషోర్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News