డ్రోన్ ను పరిశీలించిన జగన్
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. పథకం అమలు, దాని తీరు తెన్నుల గురించి జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వేను నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో...
భూసర్వే కోసం అత్యాధుని సాంకేతి పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కల్లం తదితరులు పాల్గొన్నారు.