ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.

Update: 2025-11-26 07:51 GMT

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నేడు ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు నేడు ఏసీబీ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. అయితే ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో వీరికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సిట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తీర్పుపై స్టే...
నిందితులు సాక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశముందని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఇరువురు వాదనలను విన్న అనంతరం డిఫాల్ట్‌ బెయిల్‌ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేడు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వారికి ఊరట లభించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.


Tags:    

Similar News