ఆర్టీసీ ఉద్యోగుకు సర్కార్ గుడ్ న్యూస్
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీలో 1/2019 సర్కులర్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం ద్వారా 48 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. 1/2019 సర్కులర్ను పునరుద్దరించాలని ఇటీవల ఎన్ఎంయూఏ గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
సర్క్యూలర్ ను నిలిపేస్తూ...
గత ప్రభుత్వ హయాంలో 1/2019 సర్కులర్ ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చిన్న తప్పిదాలకే పెద్ద శిక్షలు విధిస్తున్నారని యాజమాన్యం దృష్టికిఉద్యోగులు తెచ్చారు. 1/2019 సర్కులర్ కు కట్టుబడి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. సిబ్బందిపై చర్యలు తీసుకునే ముందు 1/2019 సర్కులర్ లోని అంశాలు పాటించాలని ఆదేశాలు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.