నేడు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో

నేడు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో తుది విచారణ జరగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై 77 పిటీషన్లు దాఖలయ్యాయి

Update: 2022-02-02 03:39 GMT

నేడు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో తుది విచారణ జరగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో 77 పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణకు వచ్చే సమయంలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కు తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.

కొనసాగించాలని....
అయితే పిటీషనర్లు మాత్రం ఈ బిల్లుల్లో మార్పులు చేసి తెస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు కోర్టుకు నివేదించారు. విచారణను కొనసాగించాలని పిటీషనర్లు కోరారు. ఏఏ అంశాలపై విచారణ చేయాలో అఫడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పిటీషనర్లకు సూచించింది. దీంతో నేడు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.


Tags:    

Similar News